బాధిత కుటుంబానికి అండగా  ఉంటా

బాధిత కుటుంబానికి అండగా  ఉంటా

డీసీసీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్ట్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు.మెదక్ మండలం మక్త భూపతిపూర్ గ్రామానికి చెందిన కొమ్ము శ్రీకాంత్ ఇల్లు  అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోగా గుడిసెను పరిశీలించి తక్షణ సహాయం కింద 5 వేల రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్లె రాంచందర్ గౌడ్, మండల అధ్యక్షులు శంకర్, గూడూరి ఆంజనేయులు, మురళి, సిద్ధ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, రమేష్ గౌడ్ ప్రేమ్ కుమార్,  మహేష్ కుమార్, ఉదయ్ కుమార్, అజయ్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.