ధాన్యం కొనుగోలు చేయాలని చండూర్ చౌరస్తాలో కాంగ్రెస్  ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలని చండూర్ చౌరస్తాలో కాంగ్రెస్  ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: చిలప్ చెడ్ వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని మండలం చండూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు పండరీ, సోమక్కపేట సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు, రైతులు చిట్కుల్ చౌరస్తాలో వడ్ల కాంట పెట్టకపోవడం వల్ల, లారీలు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి తహసిల్దార్ ముసాదిక్ చేరుకొని రైతుల సమస్యలు అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీవో సాయిరాంతో ఫోన్ మాట్లాడారు. పది రోజుల్లో మొత్తం అన్ని సెంటర్లలో ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో విఠల్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జంగరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు సుధాకర్, భగవంతు రెడ్డి, చిట్కుల్ మాజీ సర్పంచ్ భీమయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.