ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు మృతి

మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ లో విషాదం
ముద్ర ప్రతినిధి, మెదక్: బావిలో సింగల్ ఫేస్ మోటర్ దించడానికి వెళ్లిన ఇద్దరు యువకులు అందులోనే మునిగి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మైసమ్మగారి స్వామి (25), బాయికాడి ప్రవీణ్ (20) ఇద్దరు మరో ఇద్దరితో కలిసి బావిలో మోటర్ దించడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు మోటార్ దించుతున్న సమయంలో అదుపుతప్పి బావిలో పడగా ఇద్దరు మృతి చెందారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని శవాలను వెలికి తీయడం కోసం మోటార్ల ద్వారా బావిలో నుండి నీటిని తోడుతున్నారు. 

రెండు రోజుల క్రితమే స్వామికి నిశ్చితార్థం
బావిలో పడి మృతి చెందిన మైసమ్మగారి స్వామికి ఆదివారం రోజు నిశ్చితార్థం జరిగింది. గజ్వేల్ సమీపంలోని ఒంటిమామిడి గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం కాగా మే మాసంలో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే బావిలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.