నిధుల మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్సీ శేరి

నిధుల మంజూరు ఉత్తర్వులు అందజేసిన ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి,మెదక్: :మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పనుల మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మంగళవారం సాయంత్రం అందజేశారు. రామాయంపేట్ పట్టణంలోని బీసీ(ముదిరాజ్) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షమంజూరు చేశారు.  రామాయంపేట్ పట్టణంలోని కల్యాణ రామచంద్ర స్వామి ఆలయ రక్షణ నిర్మాణంకు  రూ.10 లక్షలు మంజూరు పత్రాలను ఆలయ కమిటీ నాయకులకు ఎమ్మెల్సీ అందించారు. ఈ సందర్భంగా రామయంపేట్ పట్టణ నాయకులు ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ముదిరాజ్ సంఘ రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచులు శివ ప్రసాద్ రావు, ఎంపీటీసీ రాజారెడ్డి, పార్టీ యువ నాయకులు రంజిత్, ముదిరాజ్ సంఘ నాయకులు ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోషయ్య, రొయ్యల కిషన్, దేవుని శరవయ్య, భూమా సిద్దిరాములు, శివగారి శివయ్య, భూమా కిషన్, రామాలయం కమిటీ నాయకులు నక్కా సిద్దిరాములు, పటేల్ రవీందర్, సంగాని సుధాకర్, నవాత్ మహేష్, తదితరులు ఉన్నారు.