మెదక్ లో వైభవంగా శివాజీ శోభాయాత్ర

మెదక్ లో వైభవంగా శివాజీ శోభాయాత్ర
  • ఆకట్టుకున్న మహారాష్ట్ర బ్యాండు బృందం
  • పాల్గొన్న ఎమ్మెల్యే పద్మ, ఎమ్మెల్సీ శేరి 

ముద్ర ప్రతినిధి, మెదక్: మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రత్యేక వాయిద్య బృందం... కాషాయ ధ్వజాలతో యువకుల కేరింతలు...కాషాయ పగిడీలు ధరించి నిర్వహించిన ర్యాలీ పట్టణంలో ఆకట్టుకుంది. మంగళవారం మెదక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ బోధన్ చౌరస్తా నుండి ప్రారంభించారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి  ప్రారంభించారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, శివాజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు మాయ శంకర్ తో పాటు రాజకీయ పార్టీలకు కచ్చితంగా నాయకులు ప్రజాప్రతినిధులు మెదక్ పట్టణం తో పాటు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన వేలాది మంది యువకులు పాల్గొన్నారు. జై భవాని వీర శివాజీ  నినాదాలతో ర్యాలీ మారు బోగింది. డీజే తో పాటు మహారాష్ట్ర నుండి తరలివచ్చిన బ్యాండ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మజ్జిగ వితరణ చేసిన ఎమ్మెల్యే పద్మ
 ర్యాలీలో పాల్గొన్న వారికి   ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ, చల్లని నీటిని అందజేశారు. విజయ డైరీ  సహకారంతో స్థానిక  క్యాంపు కార్యాలయం వద్ద స్టాల్ ఏర్పాటు చేశారు.