ఆశీర్వదించండి...కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మకండి

ఆశీర్వదించండి...కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మకండి
  • నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:ఆశీర్వదిస్తే నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నానని మీ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చానన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు సీఎం కేసీఆర్ మేనిఫెస్టో గురించి సునీతారెడ్డి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా...సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా మళ్లీ ఒకసారి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్ సింగ్, మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు  ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు నాయకులు బోయిని వీరయ్య, శ్రీనివాసరావు, మైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శివాంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.