ఓటేసిన మెదక్ ఎస్పీ రోహిణి

ఓటేసిన మెదక్ ఎస్పీ రోహిణి

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తన ఓటును నివాసం ఉంటున్న మెదక్ మండలం మాచవరం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ పట్టణం  బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ ఎస్.మహేందర్  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  పి.రోహిణి ప్రియదర్శని  మాట్లాడుతూ... ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు  వినియోగించుకోవాలని సూచించారు. 

అలాగే పోలింగ్ కేంద్రాలను సందర్శించి, విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేలా పోలీస్ సిబ్బందికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు.