కలెక్టర్ ను కలిసిన ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి

కలెక్టర్ ను కలిసిన ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:నూతనంగా నిర్మించిన మెదక్ సమీకృత జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి  జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్లు  రమేష్, వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల  ప్రజల ఇబ్బందులు తీరుతాయన్నారు. ఆయన వెంట మెదక్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మెన్లు రాగి అశోక్, ఉప్పల కిష్టయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చింతల నర్సింలు, లింగారెడ్డి, ముజీబ్ ఉన్నారు.