బతుకమ్మ సంబరాల్లో జిల్లా జడ్జి లక్ష్మి శారద

బతుకమ్మ సంబరాల్లో జిల్లా జడ్జి లక్ష్మి శారద

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.  ముఖ్య అతిధిగా జిల్లా జడ్జి పీ. లక్ష్మి శారద హాజరయ్యారు.సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్, జడ్జిలు రీటా లాల్చంద్, కల్పన, శ్రీపతి రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జెన్నారెడ్డి, న్యాయవాదులు పోచయ్య, కరునాకర్, నర్సింలు, సంతోష్ రెడ్డి, అడ్వకేట్స్ పాల్గొన్నారు. ఏఓ నాగ సుశీల; జిల్లా కోర్టు సూపరింటెండెంట్ షాహెద్, జిల్లా కోర్టు జ్యూడిషల్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్  షాబొద్దీన్, జ్యూడిషల్ ఎంప్లాయిస్, అడ్వకేట్స్, కోర్టు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.