నెరవేరిన సీఎం హామీ రూ.199 కోట్లు మంజూరు
![నెరవేరిన సీఎం హామీ రూ.199 కోట్లు మంజూరు](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f72915c6947.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ఇచ్చిన హామీ మేరకు 199 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో గల ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షల చొప్పున 73.95 కోట్లు మంజూరు చేశారు. మెదక్ మున్సిపాలిటీ రూ.50 కోట్లు, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున మంజూరయ్యాయి.
రామాయంపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. దీన్ని శనివారం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పద్మ తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. హామీలు ఇచ్చిన పక్షం రోజులకే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.