ఏడుపాయలలో అమ్మవారి పల్లకి సేవ

ఏడుపాయలలో అమ్మవారి పల్లకి సేవ

ముద్ర ప్రతినిధి, మెదక్: శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం నందు పౌర్ణమి పురస్కరించుకుని మంగళవారం రాత్రి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ ఈఓ సారా శ్రీనివాస్, పూజారుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఉత్సవ విగ్రహాన్ని ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, సూర్య శ్రీనివాస్, సాయిబాబా, రవి, వీర్ కుమార్, నరేష్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, బ్రహ్మచారి, దీపక్ రెడ్డి, విజయ్, శ్రీకాంత్, పూజారులు రావికోటి శంకర్ శర్మ, రాజేష్ శర్మ, మురళి మనోహర చారి, రాజశేఖర్ శర్మ, నాగరాజ్ శర్మ, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు.