రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాదయాత్ర

రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, మెదక్: కొన్ని శక్తులు రామాయంపేట రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుకుంటున్నాయని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ (బిఆర్ఎస్) ఆరోపించారు.  బుధవారం ఆయన రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం గత 59 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న అఖిలపక్షం నాయకులకు మద్దతుగా  నిజాంపేట మండల కేంద్రం నుండి రామాయంపేట వరకు భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-
బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీకి ఎలాంటి నష్టం తేవడం లేదన్నారు. మండుటెండలో నాతో పాటు ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం పాదయాత్రలో పాల్గొన్నారంటే ప్రజల ఆకాంక్ష ఎంత బలమైనదో, దాన్ని నాయకులు నెరవేర్చాలని, ఈ విషయంలో స్థానిక నాయకులు విఫలం అయ్యారని విమర్శించారు.