మున్సిపల్ మాజీ చైర్మన్ విట్టల్ రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మ, ఎమ్మెల్సీ శేరి

మున్సిపల్ మాజీ చైర్మన్ విట్టల్ రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పద్మ, ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి, మెదక్:అనారోగ్యంతో మృతి చెందిన మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత బడికోటి విట్టల్ రెడ్డికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, సీఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు మంగళవారం ఉదయం నివాళులర్పించారు. అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మరణించిన విషయం తెలిసిందే.

మెదక్ నియోజకవర్గంలో సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడైన విట్టల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ గా పనిచేశారు. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వెంట ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి,  విట్టల్ రెడ్డి సోదరుడు  వెల్దుర్తి పాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు గంగాధర్, టీ. శివరామ కృష్ణ, కొండ శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, అరవింద్ గౌడ్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి, పెరక కిషన్, స్వామి నాయక్ తదితరులు ఉన్నారు. అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.