మంచి నీటి పైపు లైన్ పనులను పరిశీలించిన చైర్ పర్సన్

మంచి నీటి పైపు లైన్ పనులను పరిశీలించిన చైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పట్టణంలోని స్థానిక సీత నగర్ వార్డు ప్రజల సౌకర్యార్థం వేయుచున్న మంచి నీటి పైపు లైన్ పనులను చైర్ పర్సన్ ఎన్నబోయిన  ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వార్డు ప్రజలు మంచినీటి పైప్ లైన్ ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టబోయిన గోపాల్, కాలనీ ప్రజలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.