మంచి నీటి పైపు లైన్ పనులను పరిశీలించిన చైర్ పర్సన్
![మంచి నీటి పైపు లైన్ పనులను పరిశీలించిన చైర్ పర్సన్](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64acf5c4b2bec.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి పట్టణంలోని స్థానిక సీత నగర్ వార్డు ప్రజల సౌకర్యార్థం వేయుచున్న మంచి నీటి పైపు లైన్ పనులను చైర్ పర్సన్ ఎన్నబోయిన ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలు మంచినీటి పైప్ లైన్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇట్టబోయిన గోపాల్, కాలనీ ప్రజలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.