భువనగిరి ఆసుపత్రి లో స్పెషలిటీ డాక్టర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలి

భువనగిరి ఆసుపత్రి లో స్పెషలిటీ డాక్టర్ లు ఉండేలా చర్యలు తీసుకోవాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రి లో స్పెషలిటీ డాక్టర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు అతహర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం లో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో స్పెషలిటీ డాక్టర్ లు ఆర్థోపెడిక్ , పాల్మోనాలజిస్ట్, మెదడు , గుండెకు సంబందించిన డాక్టర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

భువనగిరి జిల్లా కేంద్రం అయినప్పటికి స్పెషలిటీ డాక్టర్ లు అందుబాటులో లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని గత్యంతరం లేక హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పగటి సమయం లో కూడా స్పెషలిటీ డాక్టర్ లు లేకపోవడం విచారకరమని వాపోయారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపించి స్పెషలిటీ డాక్టర్ లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు.