ఎయిడ్స్ వ్యాధి పై అందరికీ అవగాహన కలిగించాలి:డాక్టర్ వై.పాపారావు 

ఎయిడ్స్ వ్యాధి పై అందరికీ అవగాహన కలిగించాలి:డాక్టర్ వై.పాపారావు 

ముద్ర ప్రతినిధి భువనగిరి :హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పై అందరికీ అవగాహన కలిగించాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ వై.పాపారావు అన్నారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎడిషన్ నియంత్రణ విభాగంలో యూత్ ఫెస్ట్ అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక గవర్నమెంట్ భువనగిరి జూనియర్ కళాశాలలో జిల్లాలోని రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఉన్న కళాశాలల విద్యార్థులకు 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్-వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అనే విషయాలు విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో  5కే రన్ లో  విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓస్ పి ధరణి కుమార్, సతీష్ కుమార్, సంపదయ్య, సైదులు సీడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భాను కుమార్, జిల్లాలోని హెచ్ఐవి ఎయిడ్స్ విభాగంలోని ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొన్నారు.