సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 

సహజ రంగులతో హోళీ జరుపుకోవాలి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, మెదక్: హోళీ పండుగలో సహజమైన రంగులనే వాడాలని మెదక్ ఎమ్మెల్యే  యం. పద్మాదేవేందర్  రెడ్డి పిలుపునిచ్చారు. హోళీ పర్వదినం సందర్భంగా  ప్రజలకు  శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో దినదినాభివృద్ధి సాధిస్తూ, అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయని  పేర్కొన్నారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకొని హోళీ ప్రాముఖ్యతను చాటాలని పిలుపునిచ్చారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలేకుండా ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు.