కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ విట్ఠల్

కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ విట్ఠల్
  • కండువా వేసి కాంగ్రెస్ ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి 

ముద్ర ప్రతినిధి, మెదక్:పాపన్నపేట మండలం గాంధారి పల్లి మాజీ సర్పంచ్  ఎండుగుల విట్ఠల్  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి  కండువా వేసి ఆహ్వానించారు.  ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  మోసపూరిత హామీల నుండి ప్రజలు బయట పడుతున్నారన్నారు.  రాబోయే 2 నెలల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, ఎల్లపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,  శ్రీకాంతప్ప, గోవింద్ నాయక్, శ్రీనివాస్, సతీష్ శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింలు, నాగరాజు, జగన్ రెడ్డి, సిద్ధ రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.