కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ విట్ఠల్
![కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ విట్ఠల్](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64cb3a1d41b50.jpg)
- కండువా వేసి కాంగ్రెస్ ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:పాపన్నపేట మండలం గాంధారి పల్లి మాజీ సర్పంచ్ ఎండుగుల విట్ఠల్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మోసపూరిత హామీల నుండి ప్రజలు బయట పడుతున్నారన్నారు. రాబోయే 2 నెలల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు, ఎల్లపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, గోవింద్ నాయక్, శ్రీనివాస్, సతీష్ శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింలు, నాగరాజు, జగన్ రెడ్డి, సిద్ధ రెడ్డి, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.