చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తో యువకుడు మృతి

చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తో యువకుడు మృతి

పెద్దశంకరంపేట, ముద్ర:పెద్ద శంకరంపేట మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామానికీ చెందిన  నీరుడి మోహన్ (27) చేపల వేటకు వెళ్లి విద్యుత్ ఘాతానికి గురై మరణించాడు. పెద్ద శంకరంపేట ఎస్సై బాలరాజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు,  ఎస్ ఐ, తెలిపిన వివరాల ప్రకారం బురుగుపల్లి గ్రామానికి చెందిన నీరుడి మోహన్ గ్రామ పంచాయతి పరిది లోని జమున నాయక్ తండాలో గల చెరువుల వద్దకు గురువారం సాయంత్రం మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లినాడు. అక్కడే ఉన్న పాత విద్యుత్ వైర్లు పట్టుకుని విద్యుత్ ఘాతానికి గురై మరణించినట్టు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై బాలరాజు తెలిపారు.