కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న  ఎమ్మెల్యే

కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న  ఎమ్మెల్యే

పెద్ద శంకరంపేట, ముద్ర: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం మండలంలోని కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని మండలంలో ప్రచారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం కొత్తపేట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్ల కాలంలో ఏమి చేయలేదని మళ్లీ గెలిస్తే చేయబోయేది కూడా ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కరెంటు కష్టాలు రైతులకు తెలుసునని, నేడు రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని అన్నారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు చొప్పున సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ అమలు చేయబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట జెడ్పిటిసి విజయరామరావు,  మండల ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుంట్ల రాములు, స్థానిక ఎంపీటీసీ ఎలిశమ్మ, గ్రామ సర్పంచ్ అనంత రావు, ఉతులూరు సర్పంచ్ పార్వతి శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ నవనీత, శ్రీశైలం, మాజీ ఎంపీపీ రాజు, పార్టీ సీనియర్ నాయకులు  వేణుగోపాల్ గౌడ్, ఆర్యన్ సంతోష్,  గ్రామ పార్టీ అధ్యక్షులు సంగమేశ్,  గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకరయ్య,  శ్రీనివాస్,  గ్రామ పార్టీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి,   సాయిరెడ్డి,  సుధాకర్,  సాయిలు, కురుమ కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.