కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యనీ మనోహర్ రెడ్డికి మద్దతు గా తాండూర్లో ముదిరాజుల భారీ ర్యాలీ ప్రదర్శనలో ఆకట్టుకున్న మరుగుజ్జులు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యనీ మనోహర్ రెడ్డికి మద్దతు గా తాండూర్లో ముదిరాజుల భారీ ర్యాలీ ప్రదర్శనలో ఆకట్టుకున్న మరుగుజ్జులు

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి శుక్రవారం తాండూర్ పట్టణంలో  ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈయనకు మద్దతుగా తాండూర్ నియోజకవర్గంలోని ముదిరాజులు పెద్ద ఎత్తున ర్యాలీ, ప్రదర్శన ప్రారంభమైంది. తాండూర్ పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముదిరాజ్ ప్రతినిధులు అనంతరం భారీ ర్యాలీని ప్రారంభించారు. ముదిరాజ్ సంఘం నాయకులు బాటుల వెంకట్ , నరేందర్ తదితరులు ర్యాలిని ప్రారంభించారు.

మధ్యాహ్నం  2 గంటల వరకుb ర్యాలీ నిర్వహించిన అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీనివాస రైస్ మిల్ ఇండస్ట్రియల్ పక్కన జరిగే  నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొంటారు. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల్లో ముదిరాజుల పాత్ర కీలకం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ముదిరాజ్ ఓటర్ల పై ప్రధానంగా దృష్టి సారించాయి. నియోజకవర్గంలో తాండూరు , పెదెముల్, యాలాల బషీరాబాద్ 4 మండలాల్లో కలిపి 60 వేల మంది వరకు ముదిరాజ్ ఓటర్లు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి కూడా ముదిరాజ్ ఓటర్లను ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.