Qadir Khan Incident ఖదీర్ ఘటనలో మెదక్ ఇన్స్పెక్టర్, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్

Qadir Khan Incident ఖదీర్ ఘటనలో మెదక్ ఇన్స్పెక్టర్, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్

ముద్రప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్ మృతి సంఘటనలో  మెదక్ పట్టణ ఇన్‌స్పెక్టర్ మధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు పవన్ కుమార్, ప్రశాంత్ లు సస్పెన్షన్ కు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖదీర్ ఖాన్ కేసు విషయంలో డిజిపి అంజనీ కుమార్ యాదవ్ స్పందించి విచారణ అధికారిగా ఐజి చంద్రశేఖర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం  ఐజి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని తెలిపారు.