నేడు ఎస్పీ కార్యాలయం ప్రారంభం

నేడు ఎస్పీ కార్యాలయం ప్రారంభం

 మంత్రి నిరంజన్ రెడ్డి, డిజిపి అంజనీ కుమార్ రాక
 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఎస్పీ కార్యాలయాలు కూడా నిర్మించారు. ఎప్పుడో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కూడా చేసుకోవాల్సిన ఎస్పీ కార్యాలయం ఆలస్యంగా నిర్మాణం కావడంతో మంగళవారం భవనాన్ని ప్రారంభించాను అన్నారు.