కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ప్రచారం

కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ శుక్రవారం  హావేళిఘణపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. పదేండ్లు అధికారంలో ఉన్న  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గంగాపూర్ రోడ్డు ఎందుకు వేయలేదన్నారు. ఏం అభివృద్ధి చేశారని ఓట్ల కోసం వస్తున్నారు, ప్రజలను మాయమాటలు చెప్పుతూ మోసం చేయడానికి మరోసారి వస్తున్నారని ద్వజమేత్తారు.   మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని మెదక్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ కోరారు.  మండలంలో గంగపురం, గంగపురం తండా, శమ్నాపూర్, గాజులవాయి తండా, బ్యాతోల్, తిమ్మాయిపల్లి, లింగసానిపల్లి, కొచ్చెరువు తండాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార యాత్రలో ఆయన పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఘణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కర్సు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శేరి మహేందర్ రెడ్డి, యువ న్యాయవాది జీవన్ రావ్, అజ్మీర్ స్వామి నాయక్, ప్రభాకర్ గౌడ్, బండి యాదగిరి, శివరాములు, వార్డు మెంబర్ ప్రతాప్, కుమార్, స్వామి, పెంటయ్య, ఎర్ర స్వామి, మాణిక్యం, బాల్య, మంగ్య, మోతియ తదితరులు పాల్గోన్నారు.