మహిళ వ్యవసాయ శాఖ అధికారులకు సత్కారం

మహిళ వ్యవసాయ శాఖ అధికారులకు సత్కారం

ముద్ర ప్రతినిధి, మెదక్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ లో రైతు సహాయ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఉద్యాన శాఖ జిల్లా అధికారి నర్సయ్య, డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, హాజరయ్యారు. రైతు సహాయ వేదిక ప్రతినిధులు డాకూరి వెంకటేశం, శంభు కుమార్, కుంట రాములు, సుభాష్, వివిధ మండలాల నుంచి సహాయ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.