మెదక్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ

మెదక్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ

ముద్ర ప్రతినిధి, మెదక్: మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం రాందాస్ చౌరస్తా నుండి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ సైదులు, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ పోచయ్య, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థిననీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాలలో అవగాహన కల్పించారు.