ఇక నుండి విద్యార్థులకు రాగి జావా పంపిణీ

ఇక నుండి విద్యార్థులకు రాగి జావా పంపిణీ

ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణా విద్యా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జమ్మికుంట మెదక్ లో మంగళవారం నుండి విద్యార్థులకు రాగి జావా పంపిణి కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం  విద్యార్థులచేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరణ చేశారు. విద్యార్థులకు రాగి జావా పంపిణి కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి ప్రారంభించారు.  పాఠశాలలో గ్రంధాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజగోపాల్,భూపతిగౌడ్,నర్సింహారావ్, అంజమ్మ, ప్రశాంత, అతీయ, విద్యార్థులు పాల్గొన్నారు.