మెదక్ నియోజకవర్గంలో 11 కొత్త పంచాయతీలు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి

మెదక్ నియోజకవర్గంలో 11 కొత్త పంచాయతీలు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో 11 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు. పలు గ్రామాల ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నారు. పాపన్నపేట మండలం జయపురం, తమ్మాయిపల్లి, శేరిపల్లి, కందిపల్లి గ్రామాలు. నిజాంపేట మండలం షౌకత్ పల్లి, కాశీపూర్ తండా. చిన్న శంకరంపేట మండలం రామయ్య పల్లి, హవేలి ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా. మెదక్ మండలం కొంటూర్, చీపురుదుబ్బ తండా, రామయంపేట మండలం దంతేపల్లి తండాలు ఉన్నాయి.