రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ

రెండున్నర లక్షల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్:పేదలు అనారోగ్యం బారిన  పడితే కార్పొరేట్ వైద్యం చేయించుకునే పరిస్థితిలేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణం జమ్మికుంటకు చెందిన రజియా బేగం మనమరాలు సనా ఖానం అనారోగ్యంతో బాధపడుతుండగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండున్నర లక్షల ఆర్థిక సహకారం(ఎల్ఓసి) పత్రం రజియా బేగంకు ఎమ్మెల్యే అందజేశారు. తన మనవరాలు వైద్యానికి ఎల్ఓసి చేయడానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ ఆంజనేయులు, నాయకులు లింగారెడ్డి తదితరులు ఉన్నారు.