బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మ

బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మండలం మక్త భూపతిపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన బోనాల ఉత్సవంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని ముందుకు నడిచారు. అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు. ఆమె వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింలు, కోఆప్షన్ సభ్యులు శాకీర్, ఇక్బాల్ తదితరులున్నారు.