అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గ్రంధాలయాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయంలో రికార్డులను పరిశీలించి, మౌలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రంధాలయ సభ్యత్వం సంఖ్య పెంచాలని లైబ్రరీయన్ గణేష్ ను ఆదేశించారు. ఆమె వెంట జిల్లా గ్రంథాలయ సెక్రెటరీ వంశీకృష్ణ తదితరులున్నారు.