బండి సంజయ్ కి పుష్కరాల ఆహ్వానం

బండి సంజయ్ కి పుష్కరాల ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, మెదక్:  మెదక్ జిల్లా పేరూర్ సమీపంలో నిర్వహించే శ్రీ గరుడ గంగా మంజీరా పుష్కరాలకు రావాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను కలిసి నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22 నుండి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళీ శర్మ,  దోర్బల గుణాకర్ శర్మ, మహేష్ శర్మ, చిలుకూరి శ్రీనివాసమూర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రారంభం రోజే వస్తానని తెలిపినట్లు గుణాకర్ శర్మ తెలిపారు.