రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

పెద్దశంకరంపేట, ముద్ర: అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బైక్ ఢీకొనడంతో అల్లాదుర్గం గ్రామానికి చెందిన మద్దూరి కృష్ణ గౌడ్,(30) అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ పైన వెనకాల ఉన్న అల్లాదుర్గం ఎస్సీ కాలనీ చెందిన నక్క పెంటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బహిరన్ దిబ్బ గ్రామం నుండి ట్రాక్టర్ అల్లాదుర్గం వైపు వస్తుండగా బహిరన్ దిబ్బ గ్రామానికి చేను లో పత్తి పంటకు మందు కొట్టడానికి వెళ్తుండడంతో ట్రాక్టర్,  బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్ పైన ఉన్న కృష్ణాగౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన నక్క పెంటయ్యను 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బహిరన్ దెబ్బ గ్రామంలో గల స్వంత చేనులో పత్తి పంటకు మందు కొట్టడానికి వెళ్లి మృత్యువాత పడడంతో  కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.