కోమటి చెరువు కట్ట పై సేద దీరిన మంత్రులు

కోమటి చెరువు కట్ట పై సేద దీరిన మంత్రులు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేటలోని కోమటి చెరువు కట్ట పై రాష్ట్ర మంత్రులు సేద తీరారు.ఆదివారం రాత్రి కోమటి చెరువు అందాలను  సహచర రాష్ట్ర మంత్రులకు మంత్రి హరీష్ రావు స్వయంగా చూపించారు.పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,వి శ్రీనివాస్ గౌడ్ గౌడ్ లను అధికారిక కార్యక్రమాలు ముగియగానే మంత్రి హరీష్ రావు స్వయంగా కోమటి చెరువు కట్టమీదకి తీసుకువెళ్లారు.నెక్లెస్ రోడ్డు వెంట  చెరువుగట్టు అందాలను వారికి చూపించారు.  

అనంతరము క్రీడా ప్రాంగణానికి తీసుకెళ్లి పలు గేమింగ్ షోలను వారికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు,శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపు గేమ్స్ లో పాల్గొన్నారు.చెరువులో ఏర్పాటుచేసిన లైటింగ్ లేజర్ షో చూపించారు. సిద్దిపేట మిషన్ భగీరథ పైలాన్,వాటర్ ఫౌంటెన్, తీగల వంతెన, పార్క్ తదితర ప్రదేశాలను కూడా చూపించారు. చాలాసేపు రాత్రివేళ కోమటి చెరువు కట్టమీద మంత్రులు ఉత్సాహంగా గడుపుతూ సేద తీరారు. సిద్దిపేట పట్టణాభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదమైన వాతావరణం కల్పించి వినోద ఏర్పాట్లను చేసిన సహచర మంత్రి హరీష్ రావును దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.