మంత్రుల బందోబస్తు పోలీస్ సిబ్బందికి సిపి దిశ నిర్దేశం

మంత్రుల బందోబస్తు పోలీస్ సిబ్బందికి సిపి దిశ నిర్దేశం

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లు గురువారం ఉదయం సిద్దిపేట పట్టణ  పర్యటన సందర్భంగా  బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమీషనర్ ఎన్.శ్వేత, దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట విపంచి కళా నిలయంలో బుధవారం నాడు బందోబస్తు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించారు.

మంత్రివర్యుల పర్యటన ఇర్కోడ్, సిద్దిపేట్ టౌన్, నాగుల బండ ఐటీ టవర్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసే ప్రదేశాలు తదితర ప్రాంతాలను పరిశీలించి పటిష్టమైన బందోబస్తు గురించి అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు వారి సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.