సిసి రోడ్డు పనులను ప్రారంభించిన దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్

సిద్దిపేట,ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్  పరిధిలో ఉన్న 18 వ వార్డ్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను  మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. గ్రామంలోని మార్కండేయ దేవాలయం నుండి వాటర్ ప్లాంట్ వరకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నిధులతో సి సి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు .ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నేత గన్నెబూమిరెడ్డి ,వార్డ్ ఇంచార్జ్ తుమ్మ భానుచందర్, బూత్ ఇంచార్జ్ అంకం దుబ్బయ్య, గోనె మధు పాల్గొన్నారు.