మంత్రి హరీష్ ను అభినందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మంత్రి హరీష్ ను అభినందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నూతన మంత్రి పేజీలో బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును మెదక్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్ రెడ్డిని పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. 2001 నుండి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో భాగస్వాములు కావడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఉద్యమ రోజుల నుండి పరిపాలన వరకు కేసిఆర్ కు సన్నిహితంగా ఉంటూ నేడు బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభ ఉత్సవంలో పాల్గొనడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్నారని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ పాలన దక్షతకు ఈ కార్యక్రమాలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మంత్రి హరీష్ రావుకు పుష్పగిచాన్ని అందజేసి అభినందించారు.