దేవాలయాల్లో చిరుధాన్యాల ప్రసాదం: మంత్రి అల్లోల

దేవాలయాల్లో చిరుధాన్యాల ప్రసాదం: మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో చిరుధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ లో అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం అనంతరం ఆయన నాలుగో అంతస్తులోని తన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం తొలి ఫైలు  చిరుధాన్యాల ప్రసాదం పంపిణీ పై  సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ప్రసాదాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని నాలుగు జిల్లాల్లోని 100 దేవాలయాలను ధూప దీప నైవేద్యాల పథకం పరిధిలోకి తేనున్నట్లు వివరించారు.