జగ్జీవన్ రామ్ సేవలు శ్లాఘనీయం

జగ్జీవన్ రామ్ సేవలు శ్లాఘనీయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత స్వాతంత్ర పోరాటం నుంచి తన జీవితాంతం ఎన్నో స్థాయిల్లో సేవలు చేసిన జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన సేవలను శ్లాఘించారు. స్వాతంత్ర సమరంలో పాలు పంచుకున్న జగ్జీవన్ రామ్ స్వాతంత్య్రానంతరం వివిధ పదవులు నిర్వహించి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన మహనీయుడని అన్నారు.

నిర్మల్ లో జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు