బాసర ఆలయ హుండీ లెక్కింపు 

బాసర ఆలయ హుండీ లెక్కింపు 

బాసర,ముద్ర:- నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లను  మంగళవారం లెక్కించారు.లేక్కింపు ఈ విధంగా ఉంది
నగదు 72లక్షల 76వేల రూపాయలు, మిశ్రమ బంగారం 90గ్రా 200 మిల్లీ గ్రాములు,మిశ్రమ వెండి 3కి 450గ్రా లభించినట్లు ఈఓ విజయ రామారావు తెలిపారు.ఈ లెక్కింపులో దేవస్థాన వైదిక/పరిపాలనా సిబ్బంది, ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది,బాసర పోలీసు సిబ్బంది, హోం గార్డ్స్,
వాగ్దేవి సొసైటి సభ్యులు మరియు శ్రీ శివరామ కృష్ణ భజన మండలి సేవాసమితి సిరిసిల్ల మరియు నిర్మల్ జిల్లా వారు పాల్గొన్నారు.