భర్త కోసం సతీమణి ఇంటింటి ప్రచారం

భర్త కోసం సతీమణి ఇంటింటి ప్రచారం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ను గెలిపించాలని కోరుతూ  ఆయన సతీమణి శివాని రెడ్డి మెదక్ హౌసింగ్ బోర్డులో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు కరపత్రాలు అందజేస్తూ తన భర్త మైనంపల్లి రోహిత్ ను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ముందుగా హనుమాన్ దేవాలయం లో పూజలు నిర్వహించి ఎంఐజి, ఎల్ఐజిలో  ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, బొజ్జ పవన్,  మంగ మోహన్ గౌడ్, గోదల జ్యోతి, క్రిష్ణ, మున్నా,  ఎం.ఎస్.ఎస్.ఓ. సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.