మంత్రి దామోదర్ ను కలిసిన డిసిహెచ్ డా. పి.సి.శేఖర్

మంత్రి దామోదర్ ను కలిసిన డిసిహెచ్ డా. పి.సి.శేఖర్

ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ పి. చంద్రశేఖర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో గల ఆస్పత్రుల వివరాలు, అందిస్తున్న వైద్య సేవలు వైద్యులు, వైద్య సిబ్బంది తదితర వివరాలు మంత్రికి నివేదించారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు.