జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్

ముద్ర ప్రతినిధి, మెదక్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మెదక్ క్రిస్టల్ గార్డెన్స్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హిందూ, ముస్లిం సోదరా బావంతో కలిసి మెలిసి రాష్ట్రాభివృద్ధిలో  భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసం అందరూ బాగుండేలా ప్రార్థించాలని ఆకాంక్షించారు.

పీసీసీ సభ్యులు మామిళ్ళ ఆంజనేయులు, పట్టణ పర్టీ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ శేఖర్, నాయకులు గూడూరు కృష్ణాగౌడ్, పల్లె రాంచందర్ గౌడ్, మంగ మోహన్ గౌడ్, అహ్మద్, సలీం, తాహెర్, లల్లూ,  టీడీపీ నాయకులు ఆఫ్జల్, మాజీ కౌన్సిలర్ మున్నా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.