ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని,  మైనార్టీ వర్గాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వగా కలెక్టర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలనలో ఇప్పుడు అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించి సమాజంలో గుర్తింపు తెచ్చారని కొనియాడారు.  

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలతో పాటు పేదల అభ్యున్నతే లక్ష్యంగా, గర్వంగా తలెత్తుకునే విధంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్ ఉద్దిన్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.