రైలు కింద పడి వృద్దుడి ఆత్మహత్య

రైలు కింద పడి వృద్దుడి ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఓ వృద్దుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తావునాయక్ తెలిపారు. బీబీపెట్ గ్రామానికి చెందిన బి.ఐలయ్య(67) వ్యక్తిగత కారణాలతో శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు