కాటన్ మిల్లు తనిఖీ చేసిన ఎమ్మెల్యే

కాటన్ మిల్లు తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మండలం గుద్దలపల్లి లోని శ్రీకృష్ణ కాటన్ ని ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏర్పాటు చేసిన కేంద్రాలలో రైతులకు సరైన ధర కల్పించాలని బిల్లు యజమానులను సూచించారు ఆయన మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.