ఓబిసి రాష్ట్ర నాయకులుగా శ్రీశైలం నియామకం....

ఓబిసి రాష్ట్ర నాయకులుగా శ్రీశైలం నియామకం....

ఆలేరు (ముద్ర న్యూస్):కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఓ పి సి రాష్ట్ర కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎగ్గిడి శ్రీశైలం ను నియమిస్తూ గురువారం నాడు రాష్ట్ర ఓబిసి సెల్ ఉత్తర్వులను అందజేసింది. ఈ సందర్భంగా శ్రీశైలం ముద్ర న్యూస్ తో మాట్లాడుతూ ఓబీసీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. శ్రీశైలం నియమకాన్ని టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య. ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు డాక్టర్ కుడుదుల నగేష్. ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్. మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు పాము అనిత. మహిళ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు దీప. సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి. మున్సిపల్ కౌన్సిలర్ చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి తో పాటు తదితరులు హార్షం వ్యక్తం చేశారు.....