సిఎం సహాయ నిధి 5లక్షల పత్రం అందజేసిన ఫైళ్ల శేఖర్ రెడ్డి

సిఎం సహాయ నిధి 5లక్షల పత్రం అందజేసిన ఫైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి : సిఎం సహాయ నిధి 5లక్షల రూపాయల చెక్కును భువనగిరి ఎమ్మెల్యే  ఫైళ్ల శేఖర్ రెడ్డి బుధవారం అందజేశారు. నియోజకవర్గంలో ని బీబీ  నగర్ మండలం కొండమడుగు గ్రామంలో నివసిస్తున్న ఎరుకల భాస్కర్ అనే వ్యక్తికి అనారోగ్యంతో మూత్రపిండాలు చెడిపోయాయి. ఎరుకల భాస్కర్ తల్లి ఎరుకల బలమణి తన కిడ్నీ కొడుకు కి ఇవ్వడానికి ముందుకు రాగా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి  మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా  తల్లీ కొడుకులకు చెరో 2.5 లక్షలు మొత్తం 5లక్షల రూపాయల పత్రాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో బిబి నగర్ బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.