కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ

కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ
  • కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్తు
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
  • విద్యుత్ సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా

కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాత పార్టీ అని కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్  ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు .పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాల్పడుతున్నారని రైతులకు ఇస్తానన్న 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపిస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల సంక్షేమం కొనసాగిందని రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ రైతులకు ఉచిత విద్యుత్తు తదితర మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు అన్నిటిని అమలు చేస్తుందని అన్నారు .టిఆర్ఎస్ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలోపీసీసీ మెంబర్ తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గుడిపాటి నరసయ్య ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ ,జిల్లా కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, మద్దిరాల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.