ప్రజాఏక్తా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేణుకుంట్ల ముఖేష్

ప్రజాఏక్తా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేణుకుంట్ల ముఖేష్

 భూదాన్ పోచంపల్లి, ముద్ర:భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని భీమనపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల ముఖేష్  భువనగిరి నియోజకవర్గ ప్రజాఏక్తా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాదులోని ప్రజాఏక్తా పార్టీ కార్యాలయంలో ప్రజాఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ చేతుల మీదగా బీఫామ్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఏక్తా పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి సానెం రాజు గౌడ్, మండల అధ్యక్షుడు ధ్యానమైన శీను తదితరులు పాల్గొన్నారు.